ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సింహపురి ఎక్స్‌ప్రెస్ టైమ్ మార్పు

by srinivas |
ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సింహపురి ఎక్స్‌ప్రెస్ టైమ్ మార్పు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ, తెలంగాణ ప్రయాణికుల(AP and Telangana passengers)కు దక్షిణ మధ్య రైల్వే అధికారులు(South Central Railway Officials) బిగ్ అలర్ట్ ప్రకటించారు. సికింద్రాబాద్(Secunderabad) నుంచి గూడూరు(Gudur) వెళ్లాల్సిన సింహపురి ఎక్స్‌ప్రెస్(Simhapuri Express) టైమ్ మార్పు చేస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి 10.05 గంటలకు బయల్దేరాల్సిన రైలు శుక్రవారం రాత్రి 11.05 నిమిషాలకు కదులుతుందని తెలిపారు. గతంలోనూ ఈ రైలు రాత్రి 11.05 నిమిషాలకు సికింద్రాద్ నుంచి బయల్దేరి గూడూరు జంక్షన్‌కు ఉదయం 8.55 గంటలకు చేరుకునేదని చెప్పారు. తాజాగా కూడా పాత సమయానికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సింహపూరి ఎక్స్ ప్రెస్ రైలు కదులుతుందన్నారు. సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళ్లే సింహపూరి ఎక్స్ ప్రెస్ టైమ్ మాత్రమే మార్పు చేశామని చెప్పారు. గూడూరు-సికింద్రాబాద్ సింహపురి ఎక్స్‌ప్రెస్ సమయంలో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు. గూడూరులో సాయంత్రం 6.40కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.40కు సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed