- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
'బీఆర్ఎస్ పార్టీతోనే దేశం అభివృద్ధి'
దిశ, ముషీరాబాద్ : బీఆర్ఎస్ పార్టీతోనే దేశం అభివృద్ధి సాధ్యం అవుతునందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఆదివారం గంగపుత్రకాలనీ, పార్శిగుట్ట ప్రధాన రోడ్డు మార్గంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మార్పు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలన్నారు. దేశ ప్రజలందరూ అబ్ కి సర్కార్ కిసాన్ సర్కార్ కావాలని, ప్రధాన మంత్రిగా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారన్నారు.
రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వ నమోదు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టే గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్ కుమార్, వర్కింగ్ ప్రసిడెంట్ కొండా శ్రీధర్ రెడ్డి, నాయకులు దోమల రాజు నేత, అజయ్ ముదిరాజ్, భీమర్తి అశోక్, బియ్యం శ్రీనివాస్, ప్రశాంత్, శోభ, ఉమారాణి, ప్రేమలతారెడ్డి, సంధ్య, శ్రీధర్ గౌడ్, భాస్కర్, పరుశురామ్ తదితరులు పాల్గొన్నారు.