బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన తెలంగాణ లంబాడీలు..

by Vinod kumar |
బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన తెలంగాణ లంబాడీలు..
X

దిశ, కార్వాన్: హైదరాబాద్-లంబాడీలను ఎస్టీ జాబితాలో నుండి తొలిగించాలని బీజేపీ ఎంపీ సోయం బాబు రావు వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాంపల్లి లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన తెలంగాణ లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు. కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నించిన జేఏసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు. పోలీసులకు, జేఏసీ నాయకుల మధ్య తోపులాట, పరిస్థితి ఉద్రిక్తం. సోయం బాబూరావు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి , పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్. జేఏసీ నాయకులను అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు. ఈ కార్యక్రమంలో వెంకట్ బంజారా ఓయు జేఏసీ అధ్యక్షుడు, భరత్, ఓయు జేఏసీ మహిళ నాయకురాలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed