మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి కేటీఆర్

by Mahesh |
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి కేటీఆర్
X

దిశ, శేరిలింగంపల్లి: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కార్తీక్ రెడ్డి తదితరులు కొండాపూర్‌లోని ఉత్తమ్ కుమార్ నివాసానికి వెళ్లి ఆయనను ఓదార్చారు. పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. పురుషోత్తం రెడ్డి మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నానని కేటీఆర్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed