- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
గంజాయి సాగు చేసి..విక్రయిచే ముఠా గుట్టురట్టు..
X
దిశ, ఖైరతాబాద్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని తమ స్వగ్రామం సిర్లిమెట్ట గ్రామంలో పండించిన గంజాయిని తెచ్చి నగరంలో విక్రయించి సొమ్ము చేసుకోవాలన్న గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు ఎస్.ఆర్.నగర్ పోలీసులు. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… అమీర్పేట నేచర్ క్యూర్ రైల్వే స్టేషన్ వద్ద మాధవరావు, రాకేష్ అనే ఇద్దరు యువకులు గంజాయి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో ఎస్ ఆర్ నగర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనం తో పాటు 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరి కొంత మంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ రాజు రాథోడ్, ఉమెన్ ఎస్ఐ అఖిల, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story