నేడు నాంపల్లి కోర్టుకు కేటీఆర్

by Y.Nagarani |   ( Updated:2024-10-18 03:43:13.0  )
నేడు నాంపల్లి కోర్టుకు కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు నాంపల్లి స్పెషల్ కోర్టు ముందు ఉదయం 11.30 గంటలకు హాజరుకానున్నారు. మంత్రి కొండాసురేఖపై ఆయన పరువునష్టం దావా కేసు వేశారు. ఈ కేసులో కేటీఆర్ వాంగ్మూలాన్ని ప్రతినిధుల కోర్టు రికార్డు చేయనుంది. ఇందులో సాక్షులుగా ఉన్న తులఉమ, బాల్కసుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్ కుమార్ ల వాంగ్మూలాలను కూడా నమోదు చేయనున్నారు. సెక్షన్ 356 బీఎన్ఎస్ ప్రకారం కేటీఆర్ వాంగ్మూలం కీలకం కానుంది. ఇప్పటికే 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు అందించారు. BNS 356 కింద మంత్రి కొండా సురేఖపై పరువునష్టం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పిటిషన్ లో కోరారు.

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో ఆమె తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ.. 3న కేటీఆర్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఈ నెల 14న కేసును విచారించిన కోర్టు.. మళ్లీ 18కి వాయిదా వేసింది. శుక్రవారం కేటీఆర్ సహా నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed

    null