- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో గందరగోళం..నోవాటెల్ హోటల్ అద్దాలు ధ్వంసం
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో గందరగోళం..నోవాటెల్ హోటల్ అద్దాలు ధ్వంసం
by Aamani |
X
దిశ, శేరిలింగంపల్లి : కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గందరగోళం నెలకొంది. మాదాపూర్ నోవాటెల్ లో ఆదివారం ఈ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు నిర్మాతలు. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు సుమారు 3 వేల మందికి పాస్ లు అందించారు.
అయితే వేల సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. అభిమానులు ఒక్కసారిగా ఆడిటోరియం లోకి చొచ్చుకు వచ్చారు. తమను అనుమతించడం లేదంటూ అభిమానులు నోవాటెల్ హోటల్ లోపల అద్దాలు ధ్వంసం చేశారు. హాల్ కెపాసిటీ కి మించి వేలాదిగా అభిమానులు ఫంక్షన్ కు తరలి రావడం వల్ల గందరగోళం నెలకొంది.లోపలికి దూసుకెళ్లే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేశారు.
Next Story