- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
పార్టీ కోసం పని చేయాల్సిందే.. దీపాదాస్ మున్షి ఆదేశం
దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి పేర్కొన్నారు. ఆదివారం జరిగిన సీఎల్పీ మీటింగ్లో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీ బలోపేతం కోసం పనిచేయాలన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసినప్పుడే లీడర్లకు మైలేజ్ పెరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. తాను పార్టీ డెవలప్ మెంట్ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటానని, కానీ కష్టపడి పని చేసినోళ్ల విలువను కచ్చితంగా పెంచుతానని తెలిపారు. తాను ఏఐసీసీకి ఇచ్చే రిపోర్టు కూడా ఇదే లైన్లో ఉంటాయన్నారు. పార్టీ కోసం పని చేయాల్సిందేనని దీపాదాస్ మున్షి నొక్కి చెప్పారు.