E rickshaws : ఆ నగరంలోకి ఈ-రిక్షాలకు నో ఎంట్రీ

by Hajipasha |
E rickshaws : ఆ నగరంలోకి ఈ-రిక్షాలకు నో ఎంట్రీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక నగరం లక్నోలో త్వరలోనే ఈ-రిక్షాలు కనిపించవు. ఎందుకంటే నగరంలోని ప్రధాన రోడ్లపై రాకపోకలు సాగించకుండా వాటిపై కఠిన ఆంక్షలను అమలు చేయబోతున్నారు. నగరం అవతల ఉండే కొన్ని ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే వాటిని నడుపుకునేందుకు డ్రైవర్లకు పరిమిత అనుమతులు ఇవ్వనున్నారు. ఈ-రిక్షాల వల్ల ప్రధానంగా ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోందని లక్నో నగర పాలక సంస్థ అధికార వర్గాలు గుర్తించాయి.

ఈ-రిక్షాలను డ్రైవర్లు గంటల తరబడి రోడ్ల పక్కన పార్క్ చేస్తుండటంతో ఇతర వాహనాల రాకపోకలకు అవాంతరం కలుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వాహనదారులు, ప్రజల సౌకర్యార్ధం ఈ-రిక్షాలను నగరం అవతలి ఏరియాలకు పరిమితం చేయక తప్పదని అంటున్నారు.

Next Story

Most Viewed