- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..
దిశ, చార్మినార్: ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లో ఆగి ఉన్న ప్యాసింజర్ ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన బహదూర్పురా పోలీస్స్టేషన్పరిధిలో చోటు చేసుకుంది. బహదూర్పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్యాసింజర్ఆటో ముగ్గురు ప్రయాణీకులను ఎక్కించుకుని జూపార్కు నుంచి పురానాఫూల్కు వెళ్తుండగా మార్గ మధ్యలో బహదూర్పురా చౌరస్తా వద్ద ట్రాఫిక్సిగ్నల్ వద్ద రెడ్సింబల్పడడంతో ఆగింది.
95 (ఆర్) రూట్ రాజేంద్ర నగర్ నుంచి కోఠికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ట్రాఫిక్ సిగ్నల్వద్ద ఆగిఉన్న ప్యాసింజర్ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ఆటో ముందుకు వెళ్ళి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్యాసింజర్ఆటోలో ఉన్న డ్రైవర్తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆర్టీసీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.