10 కిలోల గంజాయి పట్టివేత..

by Nagam Mallesh |
10 కిలోల గంజాయి పట్టివేత..
X

దిశ, కార్వాన్ః టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం మేరకు దూల్ పేట్ లో 10 కిలోల గంజాయిని పట్టుకొని మంగళా హట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ వైవిఎస్ సుధీంద్ర వివరాలను వెల్లడించారు. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన భరత్ అలియానా పద్మ అలియానా ఇద్దరు భార్యాభర్తలు. నగరంలోని దూల్పేట్ ప్రాంతానికి చెందిన మహేందర్ సింగ్, భరత్, పద్మలను పరిచయం చేసుకున్నాడు. మంగళ హాట్ ప్రాంతానికి చెందిన సుమన్ బాయ్ కాటేదాన్ ప్రాంతానికి చెందిన అమర్ సింగ్ వీరందరూ కలిసి గంజాయి వ్యాపారం చేసేందుకు ప్లాన్ వేశారు. వీరు గంజాయిని డెలివరీ చేస్తున్నప్పుడు మహేందర్ సింగ్ నివాసంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు, మంగళహాట్ పోలీసుల సహాయంతో పక్క సమాచారం మేరకు సోమవారం రాత్రి పట్టుకున్నారు. మహేందర్ సింగ్ తో పాటు వీరందరిని పట్టుకొని సోదాలు చేయగా వీరి వద్ద 10 కిలోల గంజాయితో పాటు 3 వేల రూపాయలు నగదును 6 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకొని వీరిని రిమాండ్ కు తరలించారు. కాగా ఒడిస్సా ప్రాంతానికి చెందిన తుక్కు పాని పరార్ లో ఉన్నట్లు తెలిపారు. అయితే భరత్ అలియానా భార్య పద్మలపై గతంలో ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 32 కిలోల గంజాయి కేసులో అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.

Next Story

Most Viewed