- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
HYD : వీధికుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు మృతి
దిశ, శేరిలింగంపల్లి : నగరంలో వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ మక్తా మహబూబ్ పేట్లో చోటుచేసుకుంది. భిక్షాటన చేస్తూ మక్తా మహబూబ్ పేట్లో ఉంటున్న కుటుంబానికి చెందిన సాత్విక్ (6) ఏళ్ల బాలుడు ఆడుకుంటూ గత రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లి కనబడకుండా పోయాడు. బాలుడి కుటుంబ సభ్యులు రాత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన ఆచూకీ లభించలేదు.
బుధవారం ఉదయం మక్తాలోని నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యం అయింది. స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు బాలుడి ఒంటిపై కుక్కలు దాడి చేసిన కాట్లను గుర్తించారు. పక్కనే డంపింగ్ యార్డ్ కావడంతో అక్కడ అధికంగా కుక్కలు ఉన్నాయని, వీధి కుక్కలు తరచూ ప్రజలపై దాడులు చేస్తున్నాయని, సాత్విక్ను కూడా కుక్కలు దాడి చేసి చంపి ఉంటాయని తెలిపారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.