- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
HYD: గాంధీ భవన్ వద్ద 317జీవో బాధితుల నిరసన.. న్యాయం చేయాలని డిమాండ్
దిశ, డైనమిక్ బ్యూరో: గాంధీ భవన్ వద్ద 317 జీవో బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్ధులకు ఈ నెల 9న నియామక పత్రాలు కూడా అందజేయాలని నిర్ణయించారు. దీంతో 317 జీవో భాదితులు ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమై ఛలో గాంధీభవన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ నాంపల్లిలోని గాంధీభవన్ ఎదుట ఉపాధ్యాయ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ సమస్యలకు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో ఆందోళన నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 317 జీవో ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. ఎన్నికల ముందు 317 జీవోను సమీక్షిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా తమ సమస్య పరిష్కరించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 డీఎస్సీ అభ్యర్ధులు నియామకం అయిన తర్వాత తమను సర్ధుబాటు చేసేందుకు ఖాళీలు ఉండవని చెబుతున్నారు. అందుకే వారి నియామకాలకు ముందే తమను స్థానికత ఆధారంగా జిల్లాలకు పంపించాలని ఉపాధ్యాయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.