మూసీ నిర్వాసితులకు భారీ గుడ్ న్యూస్.. కలెక్టర్ కీలక ప్రకటన విడుదల

by Bhoopathi Nagaiah |
మూసీ నిర్వాసితులకు భారీ గుడ్ న్యూస్.. కలెక్టర్ కీలక ప్రకటన విడుదల
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వచ్ఛందంగా వెళ్లే వారికి ఇల్లుతోపాటు నగదు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటూ స్వచ్ఛందంగా మరో ప్రాంతానికి తరలి వెళ్లే ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటితో పాటు రూ.25 వేల నగదును ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటూ స్వచ్ఛందంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు వెళ్లే వారికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed