చిన్నారులపై వీధికుక్కల దాడులు.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

by Rajesh |
చిన్నారులపై వీధికుక్కల దాడులు.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్నారులపై వీధి కుక్కల దాడులపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధికుక్కల నుంచి పిల్లలను రక్షించేందుకు పరష్కార మార్గాలను ఆన్వేషించాలని కోర్టు ఆదేశించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 3లక్షల 80వేల వీధి కుక్కలున్నాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వాటన్నింటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రహదారులపై వ్యర్థాల వల్లే కుక్కలు స్వైరవిహారం ఎక్వువైందని హైకోర్టు అభిప్రాయపడింది. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed