సీఎం రేవంత్ రెడ్డితో హీరో సాయి ధరమ్ తేజ్ భేటీ

by Prasad Jukanti |
సీఎం రేవంత్ రెడ్డితో హీరో సాయి ధరమ్ తేజ్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి ఆదివారం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఉన్నారు. కాగా ఇటీవల తండ్రి, కూతురి వీడియోను ఉద్దేశించి అసభ్యకరంగా కామెంట్లు చేసిన వ్యవహారంలో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు నీచ బుద్ధిని సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వావివరుసలు లేకుండా ఫన్నీ పేరుతో చిన్నపిల్లలను ట్రోల్స్ చేస్తున్న ప్రణీత్ లాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరకుతూ ఏపీ, తెలంగాణ సీఎంలతో పాటు డిప్యూటీ సీఎంలు, డీజీపీ, పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. చిన్నపిల్లల జాగ్రత్తపై సూచనలు చేసిన సాయిధరమ్ తేజ్ ట్వీట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి స్పందిస్తూ కృతభతలు తెలిపారు. కాగా ఈ వ్యవహారంలో ప్రణీత్ తో పాటు మరో ముగ్గురురిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ప్రణీత్ పై 67బీ ఐటీ, ఫోక్సో, 79, 294 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రణీత్ ను ఏ 1 గా, ఏ2గా నాగేశ్వర్ రావు, ఏ3గా యువరాజ్​, ఏ4గా సాయి ఆదినారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.



Next Story

Most Viewed