Heera Gold : హీరా గోల్డ్ లో ముగిసిన ED సోదాలు

by Maddikunta Saikiran |
Heera Gold : హీరా గోల్డ్ లో ముగిసిన ED సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా హీరా గోల్డ్‌ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం మరోసారి సోదాలు నిర్వహించింది.ఈ రోజు తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌తో పాటు, తిరుపతి, విశాఖపట్నంలో ఒకేసారి ఐదు చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది.తాజాగా హీరా గోల్డ్ లో ED సోదాలు ముగిసాయి.

అయితే.. హీరో గోల్డ్ అధిపతి, నౌహీరా షేక్‌ రూ. 400 కోట్ల వరకు అక్రమంగా సంపాదించారని ఈడీ అధికారులు గుర్తించారు.కాగా.. నౌహీరా షేక్‌, వివిధ స్కీమ్‌ల పేరుతో వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి ఎంతో మందిని మోసగించారన్న ఆరోపణలతో ఈడీ ఆ సంస్థపై దాడులు చేపట్టి పెద్దమొత్తంలో ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు .అంతేకాక 90 లక్షల రూపాయల నగదును, 12 కొత్త లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా.. 25 కోట్ల విలువ చేసే బినామీ ఆస్తుల పేపర్లను, నౌహీరా షేక్‌ పేరు మీదున్న 13 ఆస్తుల పత్రాలను ED అధికారులు స్వాధీనం చేసుకొని ఆమెని అరెస్ట్ చేశారు. కాగా... నౌహీరా షేక్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా 60కిపైగా కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed