గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు భారీ బందోబస్తు : డీజీపీ జితేందర్

by M.Rajitha |   ( Updated:2024-10-19 11:19:38.0  )
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు భారీ బందోబస్తు : డీజీపీ జితేందర్
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ డీజీపీ జితేందర్ తెలియజేశారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. పరీక్షలకు ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా సమస్యలు సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. హైకోర్ట్ తీర్పు మేరకే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని, టీజీపీఎస్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని అన్నారు. పరీక్షలు జరుగుతున్నప్పుడు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అన్నారు.

తెలంగాణలో అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా డీజీపీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వీధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు సిబ్బందికి నివాళులర్పిస్తామని తెలిపారు. ఇక సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని, ఈ ఘటనకు రాజకీయ రంగు పులమడం కరెక్ట్ కాదని డీజీపీ అన్నారు.

Advertisement

Next Story