చేపల వేటకు వెళ్లి వ్యక్తి దుర్మరణం

by Sridhar Babu |
చేపల వేటకు వెళ్లి వ్యక్తి దుర్మరణం
X

దిశ, సత్తుపల్లి/వేంసూరు : సరదాగా చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన వేంసూరు మండలం అమ్మపాలెంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమ్మపాలెం పెద్ద చెరువులో గ్రామానికి చెందిన కొందరు ప్రతి రోజూ చేపల వేటకు వెళ్తుంటారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పుచ్చ వెంకటేశ్వరరావు (35) శుక్రవారం మధ్యాహ్నం అమ్మపాలెం పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు జారి చెరువులో పడిపోవడంతో అందులోని ఊబిలో కూరుకు పోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు గజ ఈతగాడిన పిలిపించి శనివారం మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ ఎంఏ రాజు, ఎస్సై వీరప్రసాద్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వీరప్రసాద్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed