కారు బోల్తా.. బయటపడిన గంజాయి

by Aamani |   ( Updated:2024-10-19 13:41:18.0  )
కారు బోల్తా.. బయటపడిన గంజాయి
X

దిశ, నిజాంపేట : కారు బోల్తా పడటంతో అందులో ఉన్న గంజాయి గుట్టు బయట పడ్డ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట శివారులో శనివారం జరిగింది. 44 వ జాతీయ రహదారి లో నిజామాబాద్ వెళ్తున్న ఓ కారు మార్గ మధ్యంలో రామాయంపేట మండల పరిధిలో అదుపుతప్పి బోల్తా పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించగా భారీ మొత్తంలో గంజాయి మూటలు బయట పడ్డాయి. కారులో ఉన్న వ్యక్తులు పరారీలో ఉండగా పోలీసులు విచారణ చేపట్టారు.. 3 సంచుల్లో 32 ప్యాకెట్ల లో సుమారు 90 కేజీల పైగా ఎండు గంజాయి ఉంది. స్వాధీనం చేసుకున్న పోలీసులు కారులో వ్యక్తులు ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టారు. కారు వివరాలతో పాటు అందులో ఉన్న గంజాయి ముఠా ఎవరనేది విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story