Heart Attack : గుండె పోటుతో యువ రైతు మృతి

by Rajesh |
Heart Attack : గుండె పోటుతో యువ రైతు మృతి
X

దిశ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని వెంకట్రాపురంనకు చెందిన యువ రైతు గుగులోత్ సైదులు( 36) గుండెపోటు తో శుక్రవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని బుదవారం తమ వ్యవసాయ పనులలో ట్రాక్టర్ నడిపినట్లు తెలిపారు. గత మే నెలలో సదరు యువకుడికి వివాహం జరిగినట్లు తెలిపారు. భార్య ఆషాఢ మాసం కావడంతో తల్లి గారింటికి వెళ్లినట్లు తెలిపారు. ఇంతలోనే దుర్ఘటన చోటు చేసుకోవడంతో ఆ కుటుంబంలో, బంధు వర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు రాజకీయ నాయకులు మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed