కేసులు పెరుగుతుంటే ఏం చేస్తున్నారు?.. వైద్యాధికారులపై హెల్త్ మినిస్టర్ సీరియస్

by Gantepaka Srikanth |
కేసులు పెరుగుతుంటే ఏం చేస్తున్నారు?.. వైద్యాధికారులపై హెల్త్ మినిస్టర్ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యాధికారులపై డెంగ్యూ వ్యాధి కట్టడిపై హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా సీరియస్ అయ్యారు. డెంగ్యూ వ్యాధి నియంత్రణపై అలసత్వం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎం రివ్యూ అనంతరం ఆయన వైద్యాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల కట్టడికి చేపట్టిన చర్యలపై తనకు ప్రత్యేక రిపోర్టు వెంటనే అందజేయాలని కోరారు. వ్యాధిని కంట్రోల్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు పెరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే డెంగ్యూ కట్టడిపై రాష్ట్ర స్థాయిలో డీహెచ్ ఆధ్వర్యంలో ఓ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో పాటు జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా కంట్రోల్ రూమ్‌కు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల వివరాలు, కేసు స్టడీస్ అన్ని నమోదు కావాలన్నారు.

ఈ కంట్రోల్ రూమ్ నుంచే పేషెంట్ల చికిత్సపై ఆరా తీయాలన్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed