HARISH RAO: కాంగ్రెస్‌ సర్కారుపై హరీష్ రావు మరో సంచలన ట్వీట్

by Anjali |   ( Updated:2024-08-27 12:47:53.0  )
HARISH RAO: కాంగ్రెస్‌ సర్కారుపై హరీష్ రావు మరో సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు మరో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ వచ్చింది.. రాష్ట్రంలో తాగు నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని ధ్వజమెత్తారు. సంగారెడ్డి, వట్‌పల్లి మండలం మేడికుందా తండాలో 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలి నడకన వెళ్లి కుంట నుండి బిందెలో నీళ్లు మోసుకొచ్చుకుంటున్నారని కాంగ్రెస్ సర్కారుపై ఫైర్ అయ్యారు. కలుషిత నీళ్లు తాగటం వల్ల విషజ్వరాలు వచ్చి జనాలు ఆస్పత్రి పాలవుతున్నారని అన్నారు.

మిషన్ భగీరథ వాటర్ ఇవ్వాలని అధికారులను వేడుకున్నా స్పందించడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఇంతకు మందు హరీష్ రావు భూముల క్రమ బద్దీకరణపై కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన మాట తప్పిందని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు పేరుతో ప్రభుత్వం పేద ప్రజల రక్తమాంసాలను పీల్చడమే లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కరువైందని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed