- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
అమెరికాలో హన్మకొండ వ్యక్తి మృతి.. మృతదేహం కోసం ఎదురు చూపులు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : హన్మకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన వ్యక్తి అమెరికాలో మృత్యువాత పడ్డాడు. ఎమ్మెస్ చదివేందుకు తొమ్మిది సంవత్సరాల క్రితం ఏరుకొండ రాజేష్ అమెరికా వెళ్ళాడు. ఉన్నత చదువుల అనంతరం అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. తొమ్మిది నెలల క్రితం రాజేష్ తండ్రి చనిపోగా, అంత్యక్రియలకు తదనంతర కార్యక్రమాలు అయ్యాక తిరగి అమెరికా వెళ్ళిపోయాడు. కాగా మూడు రోజుల కింద రాజేష్ స్నేహితులు ఫోన్ చేసి అనారోగ్యంతో చనిపోయినట్టు సమాచారం అందించారు. అప్పటి నుండి కుటుంబ సభ్యులు రాజేష్ మృతదేహం కోసం ఎదురు చూస్తూ... కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని తమ వద్దకు చేర్చేందుకు సహాయం చేయాలని తల్లి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. రాజేష్ మరణించిన విషయం తెలిసి స్వగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Next Story