Governor Jishnu Dev Varma: మరికాసేపట్లో సూర్యాపేటకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..

by Shiva |
Governor Jishnu Dev Varma: మరికాసేపట్లో సూర్యాపేటకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) సూర్యాపేట జిల్లా (Suryapet District)లో పర్యటించనున్నారు. ఉదయం 8.30కి హైదరాబాద్‌ (Hydrabad)లోని రాజ్‌భవన్ (Raj Bhavan) నుంచి రోడ్డు మార్గంలో ఆయన నేరుగా సూర్యాపేట (Suryapet)కు చేరుకోనున్నారు. ఉదయం 10.30కి సూర్యాపేట కలెక్టరేట్‌ (Suryapet Collectorate) కు చేరుకుని అక్కడ పోలీసులతో గౌరవ వందనం స్వీకరించి 11.30కి జిల్లా అధికారులతో కలిసి ఆయా శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు.

అదేవిధంగా అధికారులు జిల్లాల్లో కొనసాగుతోన్న అభివృద్ధి పనులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) ద్వారా గవర్నర్‌కు జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma)కు వివరించనున్నారు. అనంతరం ఆయన జిల్లాలో రచయితలు, కవులు, కళాకారులు, పలు రంగాల్లో అవార్డు గ్రహీలతో భేటీ కానున్నారు. అయితే, అందుకు సంబంధించి సూర్యాపేట కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ (Collector Tejas Nandlal Pawar) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడే మధ్యాహ్న భోజనం చేసి అక్కడి నుంచి నేరుగా భద్రాచలం (Bhadrachalam) బయలుదేరనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన జిల్లా అధికార యంత్రాంగం సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed