కొత్త పింఛన్ దారులకు శుభవార్త.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

by Anjali |
కొత్త పింఛన్ దారులకు శుభవార్త.. మంత్రి సీతక్క కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఫించన్ దారులకు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుభవార్త అందించారు. కొత్త ఫించన్ల జారీకి అర్హుల జాబితాను రెడీ చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి రివ్య్యూలో తెలిపారు. అంతేకాకుండా బీఆర్ఎస్ సర్కారు హయాంలో పెండింగులో ఉన్న ఫించన్ల లిస్ట్ కూడా తీయాలని ఆదేశించారు. చేయూత పతకం కింద పింఛన్లు పెంచుతామని మంత్రి సీతక్క వెల్లడించారు. పించన్ల విషయంలో పింఛన్ దారులు ఎలాంటి నిరాశకు గురికావద్దని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లెక్కలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందించాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed