- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
సీఎంను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడని అనిపిస్తోంది : KTR
దిశ, వెబ్ డెస్క్ : ఈ ముఖ్యమంత్రిని చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడని అనిపిస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలను తప్పుబడుతూ ట్వీటర్ వేదికగా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. నియామకాలపై మరీ ఇంత నీతిమాలిన ప్రచారమా..? ప్రజా ధనాన్ని తగలేసి...ఫ్రంట్ పేజీల్లో పచ్చి అబద్ధాలతో ప్రకటనలా..? అంటు మండిపడ్డారు. గత ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి కదా..!తెలంగాణ యువత ను పిచ్చోళ్లను చేస్తున్నావా...? అని ప్రశ్శించారు. అశోక్ నగర్ చౌరస్తాకు..ఉస్మానియా క్యాంపస్కు పోయి చెప్తవా నీ కొలువుల పండుగ కథలు..? ఏడాదిలో 2 లక్షల కొలువులు గ్యారెంటీ అని.. నిరుద్యోగుల చెవుల్లో పువ్వులు పెట్టింది చాలక..తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టించడం దుర్మార్గం..! అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేశారు.
డీఎస్సీ 2004కు సంబంధించిన 11,062 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం ఎల్బీ స్టేడియంలో జరుగనుంది. ఈ సందర్బంగా విడుదల చేసిన ప్రచార ప్రకటనల్లోని వివిధ ఉద్యోగ నియామక లెక్కలను తప్పుబడుతూ కేటీఆర్ తన ట్వీట్ లో విమర్శలు చేశారు.
- Tags
- ktr