ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 మెయిన్స్ నాలుగవ పరీక్ష

by M.Rajitha |
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 మెయిన్స్ నాలుగవ పరీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 1 మెయిన్స్ నాలుగవ పరీక్ష నేడు ప్రశాంతంగా ముగిసింది. మెయిన్స్ పరీక్షల్లో భాగంగా నేడు భారత రాజ్యాంగం, పాలన పరీక్షను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాల్లో 21,264 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 31 వేలకు పైగా అభ్యర్థులు ఎంపిక అవగా.. నేటి హాజరు శాతం 67.7% గా నమోదు కావడం గమనార్హం. అలాగే రేపు ఐదవ పరీక్ష ఆర్థికశాస్త్రం, అభివృద్ది అంశంపై ఎగ్జామ్ ఉండనుంది.

Advertisement

Next Story

Most Viewed