నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన

by srinivas |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగ యువతను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మండిపడ్డారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరువూరులో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ జగన్ చేసిన తప్పిదాల వల్ల నిరుద్యోగ యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని, తిరువూరు నియోజకవర్గంలో 4, 5 సిల్క్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ ద్వారా శిక్షణ పొంది పోటీ పరీక్షలకు రెడీ కావాలని యువత, నిరుద్యోగులకు కేశినేని చిన్ని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed