కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ఊసే లేదు: మాజీ ఎంపీ వినోద్ కుమార్

by srinivas |
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ఊసే లేదు: మాజీ ఎంపీ వినోద్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: లోక్‌సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రబడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏపీ, బీఆర్ లాంటి రాష్ట్రాలకు కేటాయింపులు జరిపింది. కానీ తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు జరపలేదు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రబడ్జెట్‌లో తెలంగాణ ఊసే లేదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ఏపీ, బీహార్ రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు కారిడార్ బదులు హైదరాబాద్-నాగ్‌పూర్ కారిడార్ ప్రకటిస్తే ఉత్తర తెలంగాణ బాగుపడేదని ఆయన పేర్కొ్న్నారు. హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో 150 కిలో మీటర్లు మాత్రమే తెలంగాణ ప్రాంతం ఉందని చెప్పారు. తెలంగాణలోని ప్రాజెక్టులను జాతీయ హోదా అడుగుతున్నామని చెప్పారు. ఏపీ విభజన చట్టంలో ఉన్న హామీలను తెలంగాణ ఎంపీలు పట్టుబట్టి సాధించుకోవాలని సూచించారు. తాము ఎంపీలుగా ఉన్న సమయంలో చాలా హక్కులపై పోరాటం చేసి సాధించామని ఎంపీ వినోద్ గుర్తు చేశారు.



Next Story