సీనియర్ సినీ నటులు రాజేంద్రప్రసాద్ కు మాజీమంత్రి తలసాని పరామర్శ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-08 08:47:30.0  )
సీనియర్ సినీ నటులు రాజేంద్రప్రసాద్ కు మాజీమంత్రి తలసాని పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ సినీ నటులు రాజేంద్రప్రసాద్ ను మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించడంతో ఆయన కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. కూకట్ పల్లి లోని హిందూ విల్లాస్ లోని రాజేంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాజేంద్రప్రసాద్ సహా ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. కూతురు ఆకస్మిక మరణంతో దుఃఖంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ ను పలువురు సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాల వారు పరామర్శిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed