మాకు ఆ గేట్లు ఉన్నాయి.. CM రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

by Rajesh |
మాకు ఆ గేట్లు ఉన్నాయి.. CM రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి గేట్లు ఓపెన్ చేస్తే.. తమకు సుప్రీం కోర్టు గేట్లు ఉన్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని సీరియస్ అయ్యారు. ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్‌ది గురివింద గింజ వైఖరి అని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి తెలంగాణ వ్యతిరేక నాయకుల సంకలో రేవంత్ ఉన్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ నాయకులు పార్టీ మారాలని రాత్రిళ్ళు ఇంటింటికీ తిరిగి ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడేటప్పుడు సోయి ఉండి మాట్లాడాలని హితవు పలికారు. రాత్రికి రాత్రి కి వెళ్లి కండువాలు కప్పుతున్నది రేవంత్ రెడ్డి కాదా అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిందే కాంగ్రెస్ అన్నారు. దేశంలో జరుగుతున్న అనర్ధాలకు ఆ పార్టీయే కారణం అన్నారు. నాడు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరింది ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చకనే అని తేల్చిచెప్పారు.

Advertisement

Next Story

Most Viewed