తెలంగాణ ప్రజల గొంతు ఎండిపోయేలా చేస్తున్నారు.. సర్కారుపై మాజీ మంత్రి గంగుల ఫైర్

by Rajesh |
తెలంగాణ ప్రజల గొంతు ఎండిపోయేలా చేస్తున్నారు.. సర్కారుపై మాజీ మంత్రి గంగుల ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రజల గొంతు ఎండిపోయేయా చేస్తోందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ సీరియస్ అయ్యారు. ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఎల్లంపల్లి నుంచి కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని తెలిపారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు నుంచి ఒక్క చుక్క నీరు రాలేదన్నారు. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయమని మేం సూచిస్తున్నామన్నారు. వరద వస్తేనే నీటిని ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతోందన్నారు. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు లేవు. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయరని మండిపడ్డారు. చాలా జిల్లాల్లో తాగునీరు, సాగు నీరు లేకుండా పోయిందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సాకు చూపుతూ నీటిని లిఫ్ట్ చేయడం లేదన్నారు. ఇప్పటికైనా కన్నేపల్లి పంప్ ఆన్ చేసి మిడ్ మానేరు నింపాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed