యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సినీ నటుడు సుమన్

by Y. Venkata Narasimha Reddy |
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సినీ నటుడు సుమన్
X

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సినీ నటుడు సుమన్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం సుమన్ కు అర్చక పండితులు వేదాశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాలను అందించారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ మహాద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. పునర్నిర్మాణంకు ముందు ఈ ఆలయం ఎలా ఉండేదో నాకు తెలుసని, కేసీఆర్ ఎన్నో వ్యయ ప్రయాసలతో ఆలయాన్ని చాలా అందంగా అద్భుత శిల్పకళతో నిర్మింప చేశారని కొనియాడారు.

ఎంతో మంది శిల్పులు పనిచేసి, అద్భుత శిల్పాలను, గోపురాలను చెక్కారని, గుడిలోపలికి వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉందన్నారు. ఇంత అద్భుతమైన గుడిని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని, భవిష్యత్తులో యాదగిరిగుట్ట ఆలయం దేశ, విదేశాల్లో మరింత ఖ్యాతి గడిస్తుందన్నారు.

Advertisement

Next Story