Ponnam Prabhakar : సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం.. మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్

by Ramesh N |
Ponnam Prabhakar : సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం.. మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియా ఫేక్ ప్రచారం చేస్తే కేసులు పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ వ్యక్తిగతంగా తిడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నచ్చకపోతే చట్టం, న్యాయం, కోర్టులు ఉన్నాయని, ప్రజాస్వామ్యం ఉందని, అది కాకుండా బ్యాలెట్ ఓటింగ్ ఉందన్నారు.

కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించే వ్యాఖ్యలు.. వాటిని తీవ్రంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇది మంచి సంస్కృతి కాదన్నారు. ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడ్డ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ను కోరారు. కాగా, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed