రెచ్చిపోయిన హిజ్రాలు.. బాధితుల నుంచి 30 వేలు డిమాండ్!

by Disha Web Desk 5 |
రెచ్చిపోయిన హిజ్రాలు.. బాధితుల నుంచి 30 వేలు డిమాండ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొండాపూర్ లో హిజ్రాల గ్యాంగ్ రెచ్చిపోయి ప్రవర్తించి డబ్బులు తీసుకున్నారని బాధితులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఓ కుటుంబం గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. సమాచారం అందుకున్న హిజ్రా గ్యాంగ్ అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి 1 గంటకు 20 నుంచి 30 మంది హిజ్రా ముఠా గృహ ప్రవేశం చేస్తున్న ఇంట్లోకి ప్రవేశించి 30 వేల రూపాయలు డిమాండ్ చేస్తూ.. భయాందోళనకు గురి చేశారంటూ బాధితులు వాపోయారు. డబ్బు ఇచ్చేవరకు అక్కడినుంచి వెళ్లమని వీరంగం సృష్టించినట్లు తెలిపారు. అంతేగాక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినా.. కావాలంటే వీడియోలు తీసుకోండని అన్నట్లు తెలిపారు. ట్విట్టర్ లో దీనికి సంబందించిన వీడియోను పోస్టు చేసి పోలీసుల సహాయం కావాలని బాధితులు కోరారు.


Next Story

Most Viewed