- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
టీజీఆర్టీసీలో త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆర్టీసీ త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశ పెట్టనుంది. తొలుత ఈ ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులను కరీంనగర్-హైదరాబాద్, నిజామాబాద్-హైదరాబాద్ మార్గాలలో నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ-సూపర్ లగ్జరీ పేరుతో తీసుకు రానున్న ఈ బస్సులు ఇప్పటికే కరీంనగర్ డిపోకు 35, నిజామాబాద్ డిపోకు 13 చేరుకున్నాయి. ఈ బస్సులను ఆర్టీసీ ప్రైవేట్ సంస్థ నుండి అద్దెకు తీసుకుంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో సిటీ బస్సులుగా, హైదరాబాద్-విజయవాడ మధ్య అంతరాష్ట్ర సర్వీసులుగా నడిపిస్తోంది. ఈయవన్నీ మెట్రో డీలక్స్ బస్సులు కాగా ప్రస్తుతం సూపర్ లగ్జరీ బస్సులను నడిపించనుంది. త్వరలోనే వీటిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులఎ ఎక్కువగా ఉండటంతో వీటి నిర్వహణకే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అటు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొత్త బస్సులు కూడా కొనుగోలు చేయలేక పోతోంది. ఈ బస్సుల్లో డ్రైవర్లుగా బస్సు తయారీదారు సిబ్బందే ఉండగా, కండక్టర్లుగా మాత్రం ఆర్టీసీ సిబ్బంది ఉంటారు.