వరద బాధితులకు నెల జీతం విరాళం : ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

by M.Rajitha |
వరద బాధితులకు నెల జీతం విరాళం : ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు వరద బాధితులకు తన ఒక నెల జీతంను విరాళంగా ప్రకటించారు. వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఒక నెల జీతం విరాళం ఇవ్వాలని నిర్ణయించామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పష్ఠం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సహాయక చర్యలు చేపట్టామన్నారు. అందుకు తోడుగా ఒక నెల జీతాన్ని వారికి అందించనున్నామన్నారు. ప్రజల కష్టాల్లో తోడుండే పార్టీ బీఆర్ఎస్ అని, ఇప్పుడు కూడా విలయం సృష్టించిన విపత్తులో ప్రజల పక్షాన నిలబడిందని వెల్లడించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed