TG: ఇక నుంచి మరింత కఠినంగా ఉండండి.. పోలీసులు డీజీపీ ఆదేశం

by Gantepaka Srikanth |
TG: ఇక నుంచి మరింత కఠినంగా ఉండండి.. పోలీసులు డీజీపీ ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నేరాల నివారణపై డీజీపీ జితేందర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఇక నుంచి మరింత కఠినంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డయల్ 100 రెస్పాన్స్ సమయాన్ని మెరుగుపర్చాలని అన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టాలని సూచించారు. శాంతి భద్రతల విషయంతో నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నేరస్థులను ఉపేక్షించే పరిస్థితి లేదని, న్యాయస్థానాల్లో వారికి శిక్షపడేలా తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నారని డీజీపీ జితేందర్‌ పేర్కొన్నారు. బాధితులకు, ముఖ్యంగా వారిలో మహిళలు, పిల్లలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. తీవ్రమైన నేరాల విషయంలో దర్యాప్తునకు పటిష్ఠమైన వ్యవస్థను అనుసరిస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed