CM Revanth Reddy : ఎస్సీ వర్గీకరణ పై హర్షం వ్యక్తం..

by Sumithra |
CM Revanth Reddy : ఎస్సీ వర్గీకరణ పై హర్షం వ్యక్తం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ తమ సంతోషాన్ని సీఎం రేవంత్ రెడ్డితో పంచుకున్నారు. గురువారం ఆయన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇతర నాయకులతో డప్పు దరువులతో కలిసి వెళ్లి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు విషయమై రేవంత్ రెడ్డికి శాలువాతో సత్కరించి స్వీట్స్ తినిపించి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed