కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి క్యూబా ప్రభుత్వ ఆహ్వానం

by GSrikanth |   ( Updated:2023-04-11 14:44:25.0  )
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి క్యూబా ప్రభుత్వ ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్యూబా రాజధాని హవానాలో జరిగే 41వ అంతర్జాతీయ టూరిజం ఫేర్ (ఫిట్ క్యూబా)కు హాజరుకావాలంటూ కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం అందింది. మే 1 నుంచి 5 వరకు జరిగే ఈ అంతర్జాతీయ పర్యాటకోత్సవంలో పాల్గొనేందుకు రావాలంటూ కిషన్ రెడ్డికి క్యూబా పర్యాటక మంత్రి జువాన్ కార్లోస్ కార్సియా గ్రాండా మంగళవారం లేఖ రాశారు. ‘జీ 77 చైనా’ సమావేశాలకు క్యూబా నేతృత్వం వహిస్తున్న సందర్భంలో మే 5న ఏర్పాటు చేయనున్న మంత్రుల స్థాయి పర్యాటక సదస్సులో పాల్గొని ‘ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజల కోసం పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు’ అనే అంశంపై విలువైన సూచనలు ఇవ్వాలంటూ ఆ లేఖలో కార్సియా పేర్కొన్నారు.

Also Read..

ఫూలే ఆశయాలు అమలు చేయడమే మా లక్ష్యం: TDP

Advertisement

Next Story

Most Viewed