- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. సచివాలయంలో సీఎస్ అత్యవసర సమీక్ష
దిశ, వెబ్డెస్క్: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి రాష్ట్ర సచివాయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చిస్తున్నారు. కాగా, చెరువులు ఎఫ్టీఎల్, బఫర్జోన్ ప్రాంతాల్లో ఆక్రమలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైడ్రా పేరు వింటే కొందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.
తమ భవనాలను ఎక్కడ కూల్చివేస్తారోననే భయంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రా, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో క్రమంలోనే ఇవాళ సీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతేకాదు.. ఈ భేటీలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సైతం హాజరయ్యారు.