రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండడు..ఏం జరుగుతుందో కాంగ్రెస్ మిత్రులు ఫోన్ చేసి చెప్పారు.. బాజిరెడ్డి గోవర్ధన్

by Disha Web Desk 5 |
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండడు..ఏం జరుగుతుందో కాంగ్రెస్ మిత్రులు ఫోన్ చేసి చెప్పారు.. బాజిరెడ్డి గోవర్ధన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండే పరిస్థితి లేదని, ఆయనని కాంగ్రెస్ వాళ్లే బొంద పెడతారని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. తనకు ఓ పాత కాంగ్రెస్ మిత్రుడు ఫోన్ చేసి తాను గెలుస్తున్నట్లు చెప్పాడని, అలాగే సీఎం రేవంత్ రెడ్డిని పాత కాంగ్రెస్ నాయకులే బొంద పెడతారని, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదని చెప్పాడన్నారు. పాత కాంగ్రెస్ నాయకులైన హన్మంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కత్తులు పట్టుకొని తన వెంట తిరుగుతున్నారని, ఎప్పుడు పొడుస్తరో తేలియదని అన్నాట్లు తెలిపాడు.

అలాగే సీఎం రేవంత్ రెడ్డి పేగులు మెడలో వేసుకుంటానని అంటున్నాడని, నువ్వు కసబ్ వా.. లేక మేకలు, కోళ్లు కోసేవాడివా అని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. అంతేగాక బొంద పెడతా.. బుల్లెట్ దించుతా అంటున్నాడని, రౌడీవా, ముఖ్యమంత్రివా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చెప్పిన పనులు చేయకుండా దొంగ మాటలు చెప్పి దొంగ లాగా పారిపోతాడని, మళ్లీ క్యాడర్ ను తీసుకొని రండి అందరం కలిసి పోదామని చెబుతాడన్నారు. పోయిన క్యాడర్ కు తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్లు పొయిన బీఆర్ఎస్ నాయకులను కుక్కల కంటే హీనంగా చూస్తారని గోవర్ధన్ మండిపడ్డారు.

Read More...

చిందేసిన రాజయ్య.. రీ ఎంట్రీ జోష్ మామూలుగా లేదుగా!

Next Story

Most Viewed