గందరగోళంగా DSC పరీక్షల నిర్వహణ.. ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో పరీక్షలు!

by Anjali |   ( Updated:2024-07-13 08:10:40.0  )
గందరగోళంగా DSC పరీక్షల నిర్వహణ.. ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో పరీక్షలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల డీఎస్సీ పరీక్షా వాయిదా వేయాలని డీఎస్సీ అభ్యర్థులు ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రంతా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు డీఎస్సీ అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారు. అయితే 24వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యే డీఎస్సీ పరీక్ష హాల్ టికెట్లు విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో వేర్వేరు పరీక్ష కేంద్రాలను కేటాయించడంపై డీఎస్సీ అభ్యర్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్లను అస్సలే పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభంలోనే తన వైఫల్యాన్ని బయటపెట్టుకుంటున్నదని అభ్యర్థులు మండిపడ్డారు. పరీక్షలు కూడా నిర్వహించడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతుండటం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదట్లోనే ఇలాంటి తప్పులు జరిగితే.. ఇంకా ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌లో ఉద్యోగాల భర్తీ విషయంలో ఇంకెన్నీ తప్పులు దొర్లాలంటూ ఫైర్ అవుతున్నారు. కీలకమైన విద్యాశాఖకు రాష్ట్రంలో మంత్రి లేకపోవడంతో దిక్కులేని శాఖగా మారి పరీక్ష నిర్వహణలో ఒక సమగ్ర విధానాన్నే రూపొందించలేకపోయిందంటున్నారు. వెంటనే డీఎస్సీ వాయిదా వేసి సమగ్ర విధానాన్ని రూపొందించి పరీక్షలు సజావుగా నిర్వహించాలని డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed