సోనియా గాంధీని కలిసిన CM రేవంత్ రెడ్డి

by Gantepaka Srikanth |
సోనియా గాంధీని కలిసిన CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని వయనాడ్ పార్లమెంట్(Wayanad Parliament) స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రియాంకా గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ తరపున ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరు అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. ఇదిలా ఉండగా.. నామినేషన్ దాఖలుకు ముందు వయనాడ్‌ బాధితులకు కాంగ్రెస్‌ నేతలు నివాళులు అర్పించారు. ప్రకృతి విలయం వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధితుల సమాధుల వద్ద అంజలి ఘటించారు. రెండు నెలల క్రితం కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి ముండక్కై, చూరాల్‌మల ప్రాంతాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.







Advertisement

Next Story

Most Viewed