మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

by Rajesh |   ( Updated:2024-06-29 09:09:59.0  )
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన సీఎం ‘ఆదిలాబాద్ మాజీ ఎంపీ, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రమేష్ రాథోడ్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ చేశారు. కాగా, 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రమేష్ రాథోడ్ 2021లో ఈటల రాజేందర్ తో కలిసి బీజేపీలో చేరారు.

Advertisement

Next Story

Most Viewed