- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Challa Dharma Reddy: మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు..
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (Challa Dharma Reddy)పై ఫోర్జరీ కేసు నమోదైంది. విజన్ రిసార్ట్స్ పార్ట్నర్ రాజశేఖర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు (Madhapur Police) ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ధర్మారెడ్డితో పాటు రియాల్టర్ పురుషోత్తం నాయుడు (Purushottham Nayudu)లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తన స్థలానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని విజన్ రిసార్ట్స్ పార్ట్నర్ గంట రాజశేఖర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అదేవిధంగా అక్రమంగా తన ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను కూడా బెదిరింపులకు గురి చేశారని ఆరోపించారు. ఓ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లపై తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని, ఎలాగైనా తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని రాజశేఖర్ రావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు చల్లా ధర్మారెడ్డితో పాటు రియాల్టర్ పురషోత్తం నాయుడులపై మదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.