ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో బీటీఏ

by GSrikanth |
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో బీటీఏ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో బహుజన టీచర్స్ అసోసియేషన్ ఉంటుందని రాష్ట్ర అధ్యక్షుడు కల్పదర్శి చైతన్య తెలియజేశారు. శనివారం సామ్రాట్ కాంప్లెక్స్‌లో బీటీఏ రాష్ట్ర శాఖ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల అభిప్రాయం ప్రకారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో బీటీఏ ఉంటుందని, త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో అన్ని రకాల విద్యా సంస్థల్లో బహుజన విద్యార్థులు ఉన్నారని, వారికి సరైన విద్యను అందించడంలో ఇప్పుడున్న ఎమ్మెల్సీ‌లు అందరు విఫలమయ్యారని, ప్రభుత్వ విద్యావ్యవస్థ పాఠశాల క్యాలెండర్ ప్రకారం పనిచేయడం లేదని, అందరూ ప్రభుత్వం యొక్క మెప్పు కోసం తహతహలాడుతుంటారని, అలాంటి వారిని ఇక బహుజన ఉపాధ్యాయులు ఎన్నుకోవడానికి సిద్ధంగా లేరని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 'మా పిల్లలు-మా బడులు-మా ఎమ్మెల్సీ' అనే నినాదంతో ముందుకు పోతామని, ఇతర సంఘాల్లో ఉన్న బహుజన ఉపాధ్యాయులు కూడా మా వెంటే ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి గంగరాజు, గౌరవ అధ్యక్షుడు వడ్డేమాన్ బాల పీర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నం చెన్నయ్య, రాష్ట్ర కార్యదర్శి సిద్ధార్థ, విజయ్ కుమార్, వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story