తీవ్ర ఉత్కంఠ.. కవితకు బెయిల్ రావాలని సుబ్రమణ్య స్వామికి 108 దీపాలతో పూజ చేసిన BRS మహిళా నేత

by Anjali |   ( Updated:2024-09-05 13:16:20.0  )
తీవ్ర ఉత్కంఠ.. కవితకు బెయిల్ రావాలని సుబ్రమణ్య స్వామికి 108 దీపాలతో పూజ చేసిన BRS మహిళా నేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల ఉత్కంఠ నెలకొంది. నేడు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాధన్ నేతృత్వంలోని ధర్మసనం ముందుకు కవిత పిటిషన్లు వెళ్లనున్నాయి. ఇక నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ హరీష్ రావు పలువురు బీఆర్ఎస్ నాయకులతో ఢిల్లీకి పయనమైన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితక్కకు బెయిల్ రావాలని బీఆర్ఎస్ మహిళా నేత పావని గౌడ్ సుబ్రమణ్య స్వామికి 108 దీపాలతో పూజలు చేసింది. ‘రాజకీయ కక్షతో అన్యాయంగా జైలులో ఉన్న మా ఆడబిడ్డ కవితక్కకు బెయిల్ రావాలని నా ఇష్టదైవం సుబ్రమణ్య స్వామికి 108 దీపాలతో పూజ చేశాను’. అని ట్వీట్టర్ వేదికన స్వామివారికి పూజ చేసిన వీడియోలు, ఫొటోలు పంచుకుంది.

Advertisement

Next Story

Most Viewed