- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ విషయంలో బీజేపీతో పోటీ పడిన బీఆర్ఎస్.. కాంగ్రెస్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఎలక్టోరల్ బాండ్ల స్కాంలో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్ స్కాం దారుణాలు చూడండి అంటూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోని పోస్టు చేసింది. ఆ వీడియోలో మెగా కంపెనీ ఎలక్టోరల్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ కు 195 కోట్లు ఇచ్చిందని, వెంటనే ఆ కంపెనీకి బీఆర్ఎస్ కాళేశ్వరం కాంట్రాక్ట్ అప్పగించిదని, యశోద హాస్పిటల్స్ బీఆర్ఎస్ బాండ్ల రూపంలో 94 కోట్లు ఇవ్వగా.. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో ఖరీదైన ప్రభుత్వ భూములను కేసీఆర్ కట్టబెట్టాడని తెలిపారు.
అలాగే రాంఖీ కంపెనీ 50 కోట్లు ఇచ్చినందుకు, ఆ కంపెనీకి 500 కోట్ల డంప్ యార్డు కాంట్రాక్టు దక్కిందని. మైహోమ్ గ్రూప్స్ 49 కోట్లు సమర్పించుకున్నందుకు ప్రభుత్వ భూముల వేలంలో మై హోమ్ గ్రూప్స్ కు భారీ లబ్ది చేకూర్చిందని, గ్రీన్ కో 49 కోట్లు ఇవ్వగానే, ఫార్ములా ఈ రేస్ కాంట్రాక్టును ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇలా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పార్టీకి తాయిళాలు ఇచ్చిన కంపెనీలు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం నుంచి భారీగా లబ్ది పోందాయని.. ఆ కంపెనీల పేర్లు, అవి ఇచ్చిన బాండ్ల లెక్కలు సహా వారికి బీఆర్ఎస్ హయాంలో జరిగిన లబ్దికి సంబందించిన వివరాలు వీడియో ద్వారా వెల్లడించింది.
ఎలక్టోరల్ బాండ్ల స్కాంలో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్#KalvakuntlaScamily #ElectoralBondScam pic.twitter.com/XsdB71NTWA
— Aapanna Hastham (@AapannaHastham) March 28, 2024